మహబూబ్నగర్: మద్దిమడుగు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న రెండు డబ్బాలలోకి (షాపులు) కారు దూసుకుపోయింది. ఈ సంఘటన గురువారం మన్ననూర్లో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు... హైదరాబాద్కు చెందిన నలుగురు యువకులు టాటా సఫారీ (ఏపీ 28 ఏఆర్ 3699) కారులో అమ్రాబాద్ మద్దిమడుగు వైపు నుంచి అచ్చంపేట వైపు వేగంగా వచ్చారు.
ఐటీడీఏ వద్ద ఎదురుగా వస్తున్న వారిని తప్పించేక్రమంలో రోడ్డు పక్కన ఉన్న ఫొటో స్టూడియో డబ్బా(దుకాణం), మరో డబ్బాను ఢీకొట్టారు. ఈ సమయంలో డ్రైవర్తోపాటు నలుగురూ మద్యం మత్తులో ఉన్నారు. ఈ సంఘటనతో రెండు డబ్బాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాల వారిని అమ్రాబాద్ పోలీస్ స్టేషన్కు రప్పించి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిసింది.