శేరిపల్లిలో సంపూర్ణ మద్యపాన నిషేధం

7 Mar, 2023 04:02 IST|Sakshi
మాట్లాడుతున్న సర్పంచ్‌ మల్లేశం

రామాయంపేట(మెదక్‌): నార్సింగి మండలం శేరిపల్లిలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి తీర్మాణం చేశారు. గ్రామంలో ఇటీవల మద్యపానంతో కిష్టయ్య అనే వ్యక్తి మృతిచెందాడు. దీంతో గ్రామంలోని మహిళా సంఘాల ప్రతినిధులు, సర్పంచ్‌ చెప్యాల మల్లేశం ఆధ్వర్యంలో పలుమార్లు సమావేశమై ఈవిషయమై చర్చించారు. సోమ వారం గ్రామంలో మద్యం అమ్మకాలు బంద్‌ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా మద్యం అమ్మకాలు కొనసాగిస్తే రూ. పది వేలు, తాగితే రూ. ఐదు వేల జరిమానా విధించాలని తీర్మాణించారు. మద్యం అమ్మినవారిని పట్టిస్తే రూ. రెండు వేల నజరానా ప్రకటించారు. అనంతరం మహిళలు గ్రామంలో బెల్ట్‌షాపులు కొనసాగిస్తున్న వారి ఇళ్ల వద్దకు ర్యాలీగా వెళ్లి మద్యం అమ్మకాలు బంద్‌ చేయాలని హెచ్చరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు నర్సింలుగౌడ్‌, సత్యనారాయణ, సుశీల, మహిళా సంఘాల సభ్యులు, తదిత రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు