111 జీవో నేపథ్యంలో...

17 Aug, 2020 05:33 IST|Sakshi

ఇటీవల తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన జీవో 111 నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రం ‘111’. వీఆర్‌ దర్శకత్వం వహించనున్నారు. సురేష్‌ కొండేటి సమర్పణలో వై. రఘునాథరెడ్డి, స్నేహలత ఈ సినిమాని నిర్మించనున్నారు. చిత్రనిర్మాతలు మాట్లాడుతూ– ‘‘రాజకీయ రాక్షస క్రీడలో రైతులు బలవుతున్నారు.  మెతుకునిచ్చి బతుకులు పండించే పచ్చని పల్లెలు కాంక్రీట్‌ సౌధాలకు సమాధులవుతున్నాయి.

జీవోలను అడ్డుపెట్టుకుని నాయకులు, వారి తొత్తులు చేసే దురాగతాలపై ఓ యువకుని తిరుగుబాటు ఫలితమే ఈ ‘111’. హైదరాబాద్‌ శివారులో జీవో 111 పరిధిలో ఉన్న ఓ పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రభుత్వ జీవోలు ప్రజల మెరుగైన జీవన విధానానికి బలమైన ఆయుధాలవ్వాలని చెప్పే చిత్రమిది. మంచి మేకింగ్‌ విలువలు, మంచి నటులు, విప్లవాత్మక కథతో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సర్వేష్‌  మురారి, సంగీతం: లెండర్‌ లీ మార్టి.

మరిన్ని వార్తలు