Vishal: దుబాయ్‌ టు చెన్నై

30 Mar, 2021 06:35 IST|Sakshi

దాదాపు 30 రోజులు ‘ఎనిమీ’ షూటింగ్‌ కోసం దుబాయ్‌లో ఉన్నారు హీరో విశాల్‌. దుబాయ్‌ షెడ్యూల్‌ పూర్తి కావడంతో ఈ చిత్రబృందం చెన్నైకి బయలుదేరింది. ఈ షెడ్యూల్‌లో మేజర్‌గా యాక్షన్‌  సీక్వెన్సెస్‌ను షూట్‌ చేశారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎనిమీ’ చిత్రంలో హీరో ఆర్య మరో లీడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు.

ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందులో మృణాళినీ రవి, మమతా మోహన్‌దాస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్‌  సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. బాలా  దర్శకత్వంలో వచ్చిన ‘అవన్‌  ఇవన్‌  ’(2011) (తెలుగులో ‘వాడు–వీడు’) తర్వాత విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

మరిన్ని వార్తలు