నాకీ సినిమా జీవితాంతం గుర్తుంటుంది

12 Mar, 2021 01:49 IST|Sakshi
ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ, డెన్నిస్, సందీప్, అభిషేక్, దయా

– సందీప్‌ కిషన్‌

‘‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ రజనీకాంత్‌ గారి ‘బాషా’ స్థాయిలో ఉందని అందరూ అభినందిస్తుంటే సంతోషంగా ఉంది’’ అని సందీప్‌ కిషన్‌  అన్నారు. సందీప్, లావణ్యా త్రిపాఠీ జంటగా డెన్నిస్‌ జీవన్‌  కానుకొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్, సందీప్‌ కిషన్, దయా పన్నెం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో సందీప్‌ కిషన్‌  మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకుల స్పందన మాకొక ధైర్యాన్ని ఇచ్చింది.

కొత్త కంటెంట్‌తో సినిమాలు చేయవచ్చనే నమ్మకం పెరిగింది. మా సినిమా డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు లాభాలతో హ్యాపీగా ఉన్నాం అని చెబుతున్నారు. జీవితాంతం నాకీ  సినిమా గుర్తుంటుంది’’ అన్నారు. ‘‘నా ఫస్ట్‌ మూవీని హిట్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు డెన్నిస్‌ జీవన్‌. ‘‘మా సినిమా పంపిణీదారులందరూ ఫోన్‌  చేసి, ‘సేఫ్‌ అయ్యాం, సంతోషంగా ఉన్నాం’ అని చెబుతుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఒక ప్రేక్షకుడిగా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ లాంటి మంచి సినిమా చూసినందుకు గర్వంగా ఫీలవుతున్నాను’’ అన్నారు కోన వెంకట్‌.

మరిన్ని వార్తలు