Aadavallu Meeku Joharlu: ఆకట్టుకున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' టైటిల్‌ సాంగ్‌

4 Feb, 2022 17:53 IST|Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా, యంగ్‌ హీరో శర్వానంద్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిశోర్​ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్​ బ్యానర్​పై సుధాకర్​ చెరుకూరి నిర్మిస్తున్నారు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేసింది.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఆకట్టుకుంటుంది.

మరిన్ని వార్తలు