Aadhi Pinisetty: ‘వైశాలి’ డైరెక్టర్‌తో మరోసారి జతకట్టిన ఆది, ద్విభాషా చిత్రంగా శబ్దం..

15 Dec, 2022 10:30 IST|Sakshi

‘వైశాలి’ వంటి సూపర్‌హిట్‌ మూవీ తర్వాత హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌ కాంబినేషన్‌లో ‘శబ్దం’ అనే చిత్రం రూపొందనుంది. 7ఎ ఫిలింస్‌ ఆల్ఫా ఫ్రేమ్స్‌పై 7ఎ శివ తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బుధవారం (డిసెంబరు 14) ఆది బర్త్‌డే సందర్భంగా ‘శబ్దం’ చిత్రాన్ని ప్రకటించారు.

‘‘సూపర్‌ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తాం. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు