Aadi Saikumar : 'క్రేజీ ఫెలో'గా మారిపోయిన హీరో ఆది.. లుక్‌ చూశారా?

19 May, 2022 18:44 IST|Sakshi

హీరో ఆది సాయికుమార్‌ నటిస్తున్న తాజా చిత్రం క్రేజీ ఫెలో. ఫణికృష్ణ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఆదికి జోడీగా దిగంగన సూర్యవంశి, మిర్నా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో ఆది కూల్‌ లుక్‌లో కనిపిస్తున్నారు.

కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స‌త్య‌సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కెకె రాధామోహ‌న్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో షరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా, సతీష్‌ ముత్యాల సినిమాటోగ్రఫర్‪గా పని చేస్తున్నారు. 


 

మరిన్ని వార్తలు