‘గ్రీన్‌’ చాలెంజ్‌లో మొక్కలు నాటిన ఆమిర్‌ఖాన్‌ 

20 Sep, 2021 01:17 IST|Sakshi
మొక్క నాటిన అనంతరం ఆమిర్‌ఖాన్, నాగచైతన్యలతో  సెల్ఫీ తీసుకుంటున్న ఎంపీ సంతోష్‌కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’లో భాగంగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆమిర్‌ఖాన్‌ ఆదివారం బేగంపేట విమానాశ్రయంలో మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ చద్దా’సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సహనటుడు, టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగచైతన్య, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌తో కలిసి విమానాశ్రయంలో ఆయన మొక్కలు నాటారు. జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను ఈ సందర్భంగా ఆమిర్‌ఖాన్‌ అభినందించారు. ‘మనందరం తప్పనిసరిగా మొక్కలు నాటాలి. అప్పుడే భవిష్యత్‌ తరాలు జీవించడానికి అవకాశం ఇచ్చినవాళ్లమవుతాం. మొక్కలు నాటడాన్ని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలి’అని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు