MAA Meeting: ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ సభ్యులతో ముగిసిన 'మా' భేటీ!

3 Aug, 2022 17:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ సభ్యులతో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) సమావేశం ముగిసింది. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో దిల్‌ రాజు, జీవిత రాజశేఖర్‌, రఘుబాబు, మంచు విష్ణు, తదితరులు పాల్గొన్నారు. సినిమా షూటింగుల నిలుపుదల, ఆర్టిస్టుల పారితోషికం విషయాలపై చర్చించారు. కాగా పారితోషికం తగ్గింపు విషయంలో ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఇదివరకే ప్రత్యేక కమిటీని వేసింది. మరోవైపు ఇదే విషయంపై ఫిలిం ఛాంబర్‌ ఆధ్వర్యంలో 33 మందితో ఓ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే!

చదవండి: అందం కోసం సర్జరీకి సిద్ధమైన ‘బేబమ్మ’.. ఆ బాడీ పార్ట్‌కు మెరుగులు
 ఆ హీరోయిన్‌తో డేటింగ్‌ వార్తలపై నోరు విప్పిన చై, ఏమన్నాడంటే..

మరిన్ని వార్తలు