Sarath Kumar: మరోసారి కరోనా బారిన పడ్డ నటుడు శరత్‌ కుమార్‌

2 Feb, 2022 16:22 IST|Sakshi

క‌రోనా మ‌హ‌మ్మారి ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌డం లేదు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా ఏదో ఒక‌ర‌కంగా అది వ్యాపిస్తూనే ఉంది. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో ప‌లువురు సెల‌బ్రిటీలు క‌రోనాతో పోరాడుతుండ‌గా తాజాగా ప్రముఖ నటుడు, నటి రాధిక భర్త శరత్‌ కుమార్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. 

మంగళవారం సాయంత్రం ఆయన ట్వీట్‌ చేస్తూ.. ‘నా సన్నిహితులు,  శ్రేయోభిలాషులందరికీ శుభ సాయంత్రం. ఈ సాయంత్రం నేను కరోనా వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించాను. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల కాలంతో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నారు’ అంటూ శరత్‌ కుమార్‌ ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా గతంలో కూడా ఆయన మహమ్మారి బారిన పడ్డారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తాజాగా తెరకెక్కిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్‌ సమయంలో ఆయనకు కరోనా సొకింది. తాజాగా మరోసారి ఆయనకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో శరత్‌ కుమార్‌ ఫ్యాన్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు