Actor Fahadh Faasil To Debut In Bollywood Films: కరోనా మహమ్మారి కారణంగా థియేటర్లు మూతపడటంతో సినీ ప్రేమికులు ఓటీటీల బాట పట్టారు. ఆ సమయంలో సినీ అభిమానులు, ప్రేక్షకులను అలరించిన ఏకైక నటుడు ఫహద్ ఫాజిల్. ఈ మళయాల నటుడు తన అద్భుత నటనాకౌశల్యంతో ప్రేక్షకుల నుంచే కాదు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఓటీటీ ఫ్లాట్ఫామ్లలో వచ్చిన జోజి, కార్బన్, జన్ ప్రకాశన్, కుంబలంగి నైట్స్, సూపర్ డీలక్స్ వంటి చిత్రాలతో అలరించాడు. ఈ ఫేమ్తోనే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న'పుష్ప: ది రైజ్' సినిమాలో ప్రతినాయకుడిగా ఆఫర్ కొట్టేసి, విలనిజం చూపించబోతున్నారు.
తాజాగా ఫహద్పై బాలీవుడ్ దర్శకుల కన్ను పడింది. అతనితో బాలీవుడ్ డైరెక్టర్లు సినిమా తీసేందుకు చర్చలు జరుగుతున్నాయి. అంటే త్వరలోనే ఫహద్ ఫాజిల్ బీటౌన్లో అరంగ్రేటం చేయనున్నారు. ఈ విషయం గురించి ఫహద్ 'చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడే అన్ని విషయాలు చెప్పలేను. ఏం జరుగుతుందో చూద్దాం.' అని చెప్పుకొచ్చాడు. ఇంతకుముందు ఓటీటీలో రిలిజైన మాలీవుడ్ థ్రిల్లర్ 'మాలిక్' మూవీలో నటించాడు ఫహద్. రాజకీయ నేపథ్యం ఉన్న ఈ చిత్రంలో అతను వృద్ధాప్య పితృస్వామ్య పాత్ర పోషించాడు. దీని గురించి 'నేను చేసిన సులేమాన్ పాత్ర, తన వర్గాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది.' అని ఫహాద్ తెలిపారు.
అలాగే మాలిక్ చిత్ర దర్శకుడు గురించి ఫహద్ మాట్లాడుతూ, 'గతంలో మహేష్ నారాయణన్తో నేను సీ యూ సూన్, టేక్ ఆఫ్ సినిమాలు చేశాను. ప్రధానంగా నేను ఏం చేయగలనో స్పష్టంగా తెలిసిన స్నేహితుడు మహేష్. అతను ఏం కోరుకుంటాడో నాకు అవగాహన ఉంది. ఎప్పుడూ సినిమా కోసం ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది.' అని చెప్పారు. పుష్ప సినిమాలో ప్రతినాయకుడి పాత్ర గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాని ఫహద్ తెలిపారు. షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది చదవండి: రామ్ చరణ్కు గట్టి పోటీ ఇవ్వబోతోన్న ఫహద్ ఫాజిల్!