నిర్మాతగా కృష్ణుడు

6 Aug, 2020 06:07 IST|Sakshi
కుమార్తె నిత్యతో కృష్ణుడు

‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’ చిత్రాల్లో కథానాయకుడిగా, పలు చిత్రాల్లో చేసిన కీలక పాత్రల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణుడు నిర్మాతగా మారారు. తన కుమార్తె నిత్య పేరు మీద నిత్యా క్రియేషన్స్‌ అనే ఓ నిర్మాణ సంస్థను స్థాపించారాయన. లోతుగడ్డ జయరామ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ కృష్ణుడు నిర్మించిన సినిమా ‘మై బాయ్‌ ఫ్రెండ్స్‌ గర్ల్‌ ఫ్రెండ్‌’. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ –‘‘నేటితరం యువత భావాలకు అద్దం పట్టేలా మా చిత్రం ఉంటుంది. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూశాక సంతృప్తిగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు నటుడిగా నన్నెంతో ఆదించారు.. ఇప్పుడు నిర్మాతగా నా ప్రయాణాన్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.
 

మరిన్ని వార్తలు