ప్రముఖ సీరియల్ నటుడు ముకేశ్ గౌడ(రిషి) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తను పంచప్రాణాలుగా భావించే తండ్రి అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన ముఖేశ్ షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో నటుడి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విచారం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
'మాతృదేవో భవ.. పితృదేవో భవ.. తల్లిదండ్రులను ప్రత్యక్షదైవాలని చెప్తారు. కానీ కొందరే ఆ మాటను గౌరవిస్తారు. అలాంటివారిలో ముకేశ్ గౌడ ఒకరు. పక్షవాతం వచ్చి కదల్లేని స్థితిలో ఉన్న తండ్రిని అన్నీ తానై చూసుకున్నాడు. అవసరం తీరాక పేరెంట్స్ను రోడ్డునపడేస్తున్న ఎంతోమందికి గుణపాఠం చెప్తూ అందరికీ నిలువెత్తు ఉదాహరణగా నిలిచాడు. గతంలో ఓ కార్యక్రమంలో తన తండ్రి గురించి మాట్లాడుతూ.. మా నాన్నను నాకే పుట్టిన కొడుకులా చూసుకున్నాను. ఇది అందరి జీవితంలో జరుగుతుందో లేదో కానీ నా లైఫ్లో జరిగింది. అది నా అదృష్టం' అని ఎమోషనల్ అయ్యాడు.
మోడలింగ్తో కెరీర్ ప్రారంభించిన ముఖేశ్ 2015లో మిస్టర్ కర్ణాటక టైటిల్ అందుకున్నాడు. నాగకన్నిక సీరియల్తో బుల్లితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రేమ నగర్తో తెలుగు టీవీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. గుప్పెడంత మనసు సీరియల్తో ఎనలేని ప్రేమాభిమానాలను సంపాదించుకున్నాడు.
చదవండి: ఫస్ట్ సినిమాకే లక్ష అడిగా.. అందరూ షాకయ్యారు: పొన్నంబళం