కరోనా వైరస్కు విరుగుడుగా తీసుకువచ్చిన టీకా పంపిణీ దేశవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోంది. తెలంగాణలోనూ విస్తృతంగా టీకాల పంపిణీ జరుగుతోంది. రెండో దశలో భాగంగా ప్రజాప్రతినిధులు, ప్రముఖులు టీకాను పొందుతున్నారు. తాజాగా టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున కూడా టీకా వేసుకున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మంగళవారం నాగార్జున టీకా మొదటి డోసు వేయించుకున్నారు. ఈ విషయాన్ని నాగ్ ట్విటర్ ద్వారా తెలిపారు.
‘నిన్న నేను కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నా. అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలి. దీనికోసం ఆన్లైన్ http://cowin.gov.in రిజిస్టర్ చేసుకుని టీకా వేయించుకోవాలి’ అని నాగార్జున సూచించారు. నాగార్జున కోవాగ్జిన్ టీకాను వేసుకున్నారు. ఈ సందర్భంగా #Unite2FightCorona, #VaccineVarta, @MoHFW_India, @BMGFIndia అనే హ్యాష్ట్యాగ్, ట్యాగ్లు ఇచ్చి టీకా వేసుకుంటున్న ఫొటోను పంచుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తున్నా నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి.
Got my #covaxin jab yesterday .. absolutely no down time👍😊I urge whoever is eligible to take the vaccine!!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) March 17, 2021
You can now register for your #Covid19vaccine at https://t.co/Rm3ZUrv1Kx Book your vaccine. and get it done! #Unite2FightCorona#VaccineVarta@MoHFW_India @BMGFIndia pic.twitter.com/B4wjGoKLjx