Sameer Khakhar: అనారోగ్యంతో ఫర్జి నటుడు కన్నుమూత

15 Mar, 2023 12:53 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సమీర్‌ ఖాఖర్‌ (71) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని నటుడి సోదరుడు గణేశ్‌ మీడియాకు వెల్లడించాడు.

'నిన్నటి నుంచి సమీర్‌కు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదురైంది. దీంతో వెంటనే మేము ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించాం. కానీ అవయవాలు పని చేయకపోవడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు' అని చెప్పుకొచ్చాడు. నటుడి మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా సమీర్‌ ఖాన్‌ 'నుక్కడ్‌' సీరియల్‌తో ఎంతో గుర్తింపు సంపాదించారు. 'పుష్పక విమానం', 'జైహో', 'పరిందా', 'మసూమ్‌', 'రాజాబాబు' వంటి అనేక హిట్‌ చిత్రాల్లో నటించారు. ఇటీవలే ఫర్జి వెబ్‌సిరీస్‌లోనూ మెరిశారు.​

మరిన్ని వార్తలు