ఆ టాపిక్‌లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా?.. నెటిజన్‌పై మండిపడ్డ హీరో

17 Jul, 2021 19:29 IST|Sakshi

‘బాయ్స్‌’ సినిమాతో హీరోగా కెరీర్‌ మొదలుపెట్టిన, ‘నువ్వస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మ‌రిల్లు’తో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు సంపాదించాడు నటుడు సిద్దార్థ్‌. ప్రత్యేకంగా బొమ్మరిల్లు లాంటి బ్లాక్‌ బస్టర్‌తో యూత్‌లో విపరీతంగా ఫాలోయింగ్‌ వచ్చేసింది మనోడికి. అయితే ఆ త‌ర్వాత నటించిన సినిమాలు పెద్దగా విజయాలు సాధించలేదు. దీంతో కొన్నాళ్లుగా ఈ హీరోకి తెలుగులో సినిమా ఆఫ‌ర్స్ తగ్గడంతో త‌మిళ ఇండ‌స్ట్రీకి ప‌రిమితం అయ్యాడు. తాజాగా సిద్దార్థ్‌ వయసు పై ఓ నెటిజన్‌ ట్రోలింగ్ చేయగా, దానికి ఘటుగానే బదులిచ్చాడు. 

వయసు టాపిక్‌లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా?
ఏ అంశం అయినా, ముక్కుసూటిగా మాట్లాడుతూ ఈ నటుడు ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజాగా సిద్ధార్థ్‌ మరో వివాదాస్పద ట్వీట్‌తో నెట్టింట వార్తల్లో నిలిచాడు. ఓ నెటిజ‌న్ సిద్ధార్థ్‌ వయసుకు సంబంధించి.. ‘40 ఏళ్లు పైబడిన సిద్ధార్త్‌తో 20 ఏళ్ల హీరోయిన్లు నటిస్తే మాత్రం వల్లమాలిన ప్రేమలు, ముద్దుల ఎమోజీలు.. ఇదెక్కడి లాజిక్కో.. దిక్కుమాలిన లాజిక్ అంటూ’ ట్వీట్ చేసి అతనికే ట్యాగ్ చేశాడు. ఈ టీట్‌పై సిద్ధార్థ్‌ కూడా ఘాటుగానే జవాబిచ్చాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్‌లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా? ట్యాగ్ కూడా చేశావ్? సూపర్‌ రా దరిద్రమ్. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ టీట్‌ వైరల్‌గా మారి సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. 

ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ‘మహాసముద్రం’ చిత్రంలో శ‌ర్వానంద్‌, సిద్ధార్థ్ ప్రధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే సిద్ధార్థ్ లుక్ విడుద‌లై అభిమానులను ఆకట్టుకుంది.

మరిన్ని వార్తలు