ఉప్పెన సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని తనవైపుకు తిప్పుకున్న బేబమ్మ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో యంగ్ హీరోతో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు శర్వానంద్. ‘ఒకే ఒక జీవితం’తో మంచి విజయాన్ని అందుకున్న శర్వానంద్ తాజాగా మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
ఇందులో కృతిశెట్టి హీరోయిన్గా నటించనుందట. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరపగా కృతీ కూడా ఓకే చెప్పినట్లు టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట.