Adipurush Movie Director Om Raut About Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా 'రాధేశ్యామ్' ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే మిస్టర్ పర్ఫెక్ట్ పాన్ ఇండియా చిత్రాల్లో 'ఆది పురుష్' సినిమా ఒకటి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ సినిమాలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ అలరించనున్నారు. 103 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ఇటీవల చిత్రబృంద ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులనుతో ఆది పురుష్ టీం బిజీగా ఉంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11, 2022న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
తాజాగా ఈ సినిమా, ప్రభాస్ గురించి ఒక ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు డైరెక్టర్ ఓ రౌత్. 'రామాయణం 7,000 సంవత్సరాల క్రితం జరిగిన కథ. వాల్మీకి రామాయణాన్ని నా కోణంలో చూపించబోతున్నాను. అలాగే రామాయణం మొత్తం మూడు గంటల్లో చూపించడం కష్టం. కాబట్టి, మేము దానిలోని కీలక భాగాన్ని మాత్రమే చూపించనున్నాం. వెండితెరపై చూసేది అదే. మాటల్లో చెప్పడం కష్టం. ఇక ఆది పురుష్ స్క్రిప్ట్ రాసుకున్నాక రాముడిగా తను బాగా కనిపించాలి అని ప్రభాస్ నాకు చెప్పారు. అప్పుడు ఆ పాత్రకు ప్రభాస్ ఒక్కరే కరెక్ట్ అని అనిపించింది. ఆ పాత్రలో నాకు ప్రభాస్ ఒక్కరే గుర్తుకొచ్చారు. ఆ పాత్ర చేయాలంటే స్వచ్ఛమైన మనసు, కల్మషం లేని వ్యక్తిత్వం ఉండాలి. అవన్నీ నాకు ప్రభాస్లో కనిపించాయి. స్క్రిప్ట్ విన్న తర్వాత ఒకవేళ ప్రభాస్ చేయనని అనుంటే స్క్రిప్ట్ పక్కన పెట్టాలనుకున్నా' అని దర్శకుడు ఓం రౌత్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
ఇదీ చదవండి: ఆది పురుష్ మూవీ టీం సభ్యులకు ప్రభాస్ కాస్ట్లీ గిఫ్ట్స్..