Adipurush Movie: 'ఆదిపురుష్' నిర్మాత సంచలన ప్రకటన.. వారికి ఉచితంగానే!

7 Jun, 2023 20:00 IST|Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు.  తాజాగా ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం తీసుకుంది.  ఈ మూవీకి సంబంధించిన పదివేల టికెట్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ సంచలన ప్రకటన చేశారు. 

(ఇది చదవండి: 'ఆదిపురుష్' సినిమాపై వివాదం.. స్పందించిన చిత్రబృందం!)

'శ్రీరాముని ప్రతి అధ్యాయం గురించి తెలుసుకోవాలి. ఆయన అడుగు జాడల్లో మన నడవాలి. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు పది వేల టికెట్లు ఉచితంగా అందిస్తాం.  టికెట్ల కోసం గూగుల్ ఫాం నింపితే చాలు. టికెట్స్ నేరుగా పంపిస్తాం.  ' అని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు.  

(ఇది చదవండి: ప్రముఖ నటుడి కుమార్తెపై ట్రోలింగ్.. గట్టిగానే ఇచ్చి పడేసింది!)

మరిన్ని వార్తలు