మైదాన్‌లో కాలు మోపనున్న అజయ్‌ దేవ్‌గణ్‌

14 Feb, 2021 07:58 IST|Sakshi

బాలీవుడ్‌ ప్రముఖ హీరో అజయ్‌ దేవగణ్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా నటిస్తున్న చిత్రం ‘మైదాన్‌’. ఇండియన్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ కోచ్, మేనేజర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకత్వంలో ఈ సినిమాను బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. లాక్‌డౌన్‌ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను మళ్లీ ప్రారంభిస్తున్నారు. ఈరోజు నుంచి ఫుట్‌బాల్‌ కోచ్‌గా అజయ్‌ మైదానంలో అడుగుపెట్టనున్నారు. ఏప్రిల్‌ వరకూ ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. అక్టోబర్‌ 15న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. 

చదవండి: ‘థ్యాంక్‌ గాడ్‌’ అంటున్న అజయ్‌, రకుల్‌

మరిన్ని వార్తలు