కాంబినేషన్‌ షురూ

10 Sep, 2020 02:20 IST|Sakshi
అఖిల్‌, సురేందర్‌ రెడ్డి

హీరో అఖిల్‌–దర్శకుడు సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌ షురూ అయింది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, సరెండర్‌ 2 పతాకంపై సురేందర్‌ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తన చిత్రాల్లో హీరోలను ఫుల్‌ స్టైలిష్‌గా ప్రెజెంట్‌ చేస్తారు దర్శకుడు సురేందర్‌ రెడ్డి. అఖిల్‌ పాత్రను అలానే డిజైన్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. వంశీ–సురేందర్‌ రెడ్డి కాంబినేషన్‌లో ‘అశోక్‌’, ‘కిక్‌’, ‘రేసుగుర్రం’ తదితర హిట్‌ చిత్రాలు వచ్చాయి. తాజా చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అజయ్‌ సుంకర, పతి దీపారెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కిషోర్‌ గరికపాటి.

మరిన్ని వార్తలు