ఒక్క చూపు చాలు!

24 Jan, 2021 05:04 IST|Sakshi

‘బచ్చన్‌ పాండే’ చూపు చాలు... ఏ పనైనా అయిపోవాల్సిందే అంటున్నారు అక్షయ్‌ కుమార్‌. ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బచ్చన్‌ పాండే’. ఫర్హాద్‌ సంజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్‌ డ్రామా ఇది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. విడుదల తేదీని ప్రకటించి, ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ స్టిల్‌ను విడుదల చేశారు. ‘‘ఒక్క చూపు చాలు’’ అని ఈ ఫొటోకు క్యాప్షన్‌ చేశారు అక్షయ్‌ కుమార్‌. ఈ సినిమాలో కృతీ సనన్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నాయికలు. తమిళ చిత్రం ‘జిగర్తండా’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

మరిన్ని వార్తలు