'ఓ మై గాడ్‌-2' సీక్వెల్‌పై క్లారిటీ వచ్చేసింది..

7 Jun, 2021 00:44 IST|Sakshi

హిందీ హిట్‌ ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్‌’ (2012) చిత్రానికి సీక్వెల్‌గా ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్‌ 2’ రూపొందనుందనే టాక్‌ బీ టౌన్‌లో ఎప్పట్నుంచో వినిపిస్తూనే ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, దర్శకుడి విషయంలో నెలకొన్న కన్‌ఫ్యూజన్‌పై తాజాగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహించిన ‘ఓఎమ్‌జీ: ఓ మై గాడ్‌’ (2012) చిత్రంలో అక్షయ్‌కుమార్, పరేష్‌ రావల్, మిథున్‌ చక్రవర్తి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా సీక్వెల్‌లో అక్షయ్‌కుమార్, పంకజ్‌ త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించనున్నట్లు బాలీవుడ్‌ టాక్‌. ‘రోడ్‌ టు సంగం’ ఫేమ్‌ అమిత్‌ రాయ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్‌ ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘ఓ మై గాడ్‌’ తెలుగులో ‘గోపాల గోపాల’ (2015)గా రీమేక్‌ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది.

మరిన్ని వార్తలు