Akshay Kumar: ఛత్రపతి శివాజీగా అక్షయ్‌ కుమార్‌.. వద్దంటూ నెటిజన్స్‌ ట్రోల్‌!

7 Dec, 2022 10:43 IST|Sakshi

మహావీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా మరాఠీలో ‘వేడాట్‌ మరాఠే వీర్‌ దౌడ్లే సాత్‌’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఛత్రపతి శివాజీగా బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ నటిస్తున్నారు. మహేశ్‌ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఆరంభమైంది. ఈ సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను  రిలీజ్‌ చేశారు. ‘‘ఛత్రపతి శివాజీగా నటించడం అనేది చాలా పెద్ద బాధ్యత. నా శక్తివంచన లేకుండా కృషి చేస్తాను’’ అని పేర్కొన్నారు అక్షయ్‌ కుమార్‌.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది దీపావళికి విడుదల చేయాలనుకుంటున్నారు. కాగా హిందీలో హీరోగానూ, ప్రత్యేక పాత్రలు చేసిన చిత్రాలు, దక్షిణాదిన చేసిన రెండు మూడు చిత్రాలతో కలుపుకుని అక్షయ్‌ 150 చిత్రాలకు చేరువలో ఉన్నారు. ఇప్పుడు మరాఠీలో మెయిన్‌ లీడ్‌ యాక్టర్‌గా అక్షయ్‌కు ‘వేడాట్‌ మరాఠే వీర్‌ దౌడ్లే సాత్‌’ తొలి చిత్రం కావడం విశేషం. కాగా, చత్రపతి శివాజీ పాత్రని అక్షయ్‌ కుమార్‌ పోషించొద్దని కొంతమంది నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’లో నటించి పృథ్వీ రాజ్ చౌహాన్ పాత్రని చెడగొట్టాడని, ఇప్పుడు మరొక చారిత్రక పాత్రను పాడు చేస్తారా ఏంటి? అని ట్రోల్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు