Ram Setu: శ్రీలంకకు మకాం మార్చనున్న అక్షయ్‌

25 May, 2021 12:05 IST|Sakshi

కొన్ని రోజులు శ్రీలంకకు మకాం మార్చనున్నారు బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌. అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా 'రామ్‌సేతు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, సుష్రత్‌ భారుష హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో పురావస్తు శాస్త్రవేత్తగా కనిపించనున్నారు అక్షయ్‌. కాగా ఈ సినిమాలోని అండర్‌ వాటర్‌ సన్నివేశాలతో పాటు ఇతర కీలక సన్నివేశాలను ఊటీలో చిత్రీకరించాలనుకున్నారు.

కానీ ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా షూటింగ్‌ లొకేషన్‌ను ఊటీ నుంచి శ్రీలంకకు మార్చారట చిత్రబృందం. శ్రీలంకలో చిత్రీకరణకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారట అభిషేక్‌. ఈ ఏడాది మార్చిలో ఈ సినిమా షూటింగ్‌ ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభమైంది. అయితే అక్షయ్‌ కుమార్‌కు కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. ప్రస్తుతం అక్షయ్‌ కోలుకోవడంతో తిరిగి షూటింగ్‌ను ప్రారంభించాలనుకుంటున్నారు.

చదవండి: అక్షయ్‌ కుమార్‌ క్షేమంగా ఉన్నారు : ట్వింకిల్‌ ఖన్నా

మేకప్‌ లేకుండా ఈ స్టార్‌ హీరోయిన్లను ఎప్పుడైనా చూశారా?

మరిన్ని వార్తలు