Allari Naresh Political Entry: రాజకీయాల్లోకి అల్లరి నరేశ్‌? క్లారిటీ ఇచ్చిన హీరో

24 Nov, 2022 15:01 IST|Sakshi

అల్లరి నరేశ్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. నాంది సినిమా తర్వాత అల్లరి నరేశ్‌ నుంచి వస్తున్న మరో ఇంట్రస్టింగ్‌ చిత్రమిది. ఏఆర్‌ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటించింది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ ఇక రేపు(నవంబర్‌ 25న) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఇల్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ టీం మీడియాతో ముచ్చటించింది.

ఈ సందర్భంగా అల్లరి నరేశ్‌ రాజకియాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాజకీయల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అని ఓ రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు అల్లరి నరేశ్‌ స్పందిస్తూ.. ‘రాజకీయాలు నాకు తెలియవు. అసలు నాకు ఇంట్రస్ట్ లేని సబ్జెక్టు అది. రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. హీరోగా సక్సెస్‌ అయితే చాలు అనుకున్న. నేను చాలా సెన్సిటివ్‌ పర్సన్‌ని. సెన్సిటివ్‌గా ఉండేవాళ్లకు రాజకీయాలు పనికి రావు. అయితే దర్శకుడు అవుతాను. కానీ, రాజకీయ నాయకుడ్ని మాత్రం అవ్వను’ అంటూ తెల్చిచెప్పాడు. 

చదవండి: 
ఘనంగా అలీ కూతురు హల్దీ ఫంక్షన్‌, ఫొటోలు వైరల్‌
హీరోయిన్స్‌ కంటే అందంగా కనిపిస్తున్నానని పక్కన పెడుతున్నారు: ‘యశోద’ నటి

మరిన్ని వార్తలు