Allari Naresh : 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'.. కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

5 Nov, 2022 16:48 IST|Sakshi

అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్‌ కెరీర్‌లో 59వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. ఈనెల 11న ఈ సినిమా రిలీజ్‌ చేయాల్సి ఉండగా ఇప్పుడు విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

నవంబర్‌ 25న ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లు అనౌన్స్‌ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను అల్లరి నరేష్‌ షేర్‌ చేశారు. ఎన్నికల నిర్వహణకు ఓ మారుమూల పల్లెలో గిరిజన ప్రజలు నివసించే మారేడుమిల్లి గ్రామానికి వెళ్లే అధికారి పాత్రలో 'అల్లరి' నరేష్ నటించారు. వెన్నల కిషోర్‌, ప్రవీణ్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. 

మరిన్ని వార్తలు