Allari Naresh : 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'లో డ్యాన్స్‌ నెంబర్‌ కూడా ఉంది'

21 Nov, 2022 13:24 IST|Sakshi

అల్లరి నరేష్‌, ఆనంది హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈనెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుకను మూవీ టీం గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ సందర్భంగా అల్లరి నరేష్‌ మాట్లాడుతూ.. 'ఒకప్పుడు  తనని బాగా నటించావ్‌ అని చెప్పేవారు. కానీ ఇప్పుడు అందంగా ఉన్నావ్‌ అని అంటుంటే సిగ్గేస్తుంది.

నన్ను అంత అందంగా చూపించిన డీవోపీ రాం రెడ్డి గారి థాంక్స్. ఎడిటర్ చోటా ప్రసాద్ గారు ఆల్ రౌండర్ గా పని చేశారు. శ్రీచరణ్ చాలా హార్డ్ వర్కింగ్ కంపోజర్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఒక డ్యాన్స్ నెంబర్ కూడా వుంది. ఇక ఈ మూవీలో ఆనంది హీరోయిన్‌గా చేసింది. షూటింగ్‌ సమయానికి ఆమె బేబీకి బర్త్‌ ఇచ్చిన మూడో నెల. అయినా సరే కష్టపడి సినిమాను చేశారు.ఆనంది అద్భుతమైన నటి. ఆమెతో పని చేయడం చాలా అనందంగా వుంది.  

వెన్నెల కిషోర్, ప్రవీణ్ .. ఇలా అందరూ అద్భుతంగా చేశారు. ఇది సీరియస్ సినిమాని చాలా మంది అనుకుంటారు. కాదు. ఇందులో 40 శాతం కామెడీ వుంటుంది. 60 శాతం ఎమోషన్ వుంటుంది. సినిమా అద్భుతంగా వచ్చింది.  నా కెరీర్ నాంది లాంటి విభిన్నమైన సినిమా ఇచ్చిన నిర్మాత సతీష్ గారికి, దర్శకుడు విజయ్ కి థాంక్స్.ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ నెల 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మీరంతా థియేటర్లో చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి' అని కోరారు. 

మరిన్ని వార్తలు