Allu Aravind: అల్లు అరవింద్​కు రూ. 40 కోట్లు నష్టం !.. బన్నీ సినిమా హిందీ వెర్షన్​ లేనట్లేనా ?

25 Jan, 2022 18:55 IST|Sakshi

ఐకానిక్ స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ దర్శకత్వంలో వచ్చిన 'అల వైకుంఠపురములో' సినిమా బాక్సాఫీస్​ వద్ద మంచి హిట్​ కొట్టింది. బన్నీ స్టైలిష్​ యాక్షన్, త్రివిక్రమ్​ మ్యాజికల్​ డైలాగ్స్​ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇటీవల విడుదలైన అల్లు అర్జున్​ మాస్ పెర్ఫామెన్స్​ చిత్రం 'పుష్ప' హిట్​తో 'అల వైకుంఠపురములో' మూవీని కూడా హిందీలో విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు హిందీలో డబ్బింగ్​ కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఈ డబ్బింగ్​ వెర్షన్​ను థియేటర్లలో రిలీజ్​ చేయడాన్ని ఆపేశారు. 

ఈ సినిమాను హిందీలో 'షెహజాదే' పేరుతో రీమేక్​ చేస్తున్నారు. దీంతో రీమేక్​ నిర్మాతలకు, డబ్బింగ్​ నిర్మాతలకు మధ్య అభిప్రాయ బేధాలు కుదరకపోవడంతో సినిమా విడుదలను మానుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం 'అల వైకుంఠపురములో' సినిమా హిందీ రీమేక్​లో హీరోగా నటిస్తున్న కార్తీక్​ ఆర్యన్ అని డబ్బింగ్​ రైట్స్​ దక్కించుకున్న గోల్డ్​మైన్స్​ మనీష్​ షా ఆరోపిస్తున్నారు. ఈ హిందీ డబ్బింగ్​ వెర్షన్​ను థియేటర్లలో రిలీజ్​ చేస్తే తాను నటిస్తున్న 'షెహజాదే' చిత్రాన్ని చేయకుండా మధ్యలోనే మానేస్తానని హీరో కార్తీక్ ఆర్యన్​ నిర్మాతలకు చెప్పాడట. 

అయితే 'షెహజాదే' నిర్మాతల్లో అల్లు అరవింద్​ కూడా ఒకరు. ఇప్పటివరకూ 'షెహజాదే' చిత్రీకరణకు అయిన ఖర్చు రూ. 40 కోట్లు అని తెలుస్తోంది. 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్​ కోసం రూ. 2 కోట్లు ఖర్చు పెట్టారని సమాచారం. ఈ సినిమాను విడుదల చేస్తే తనకు రూ. 20 కోట్లు ప్రాఫిట్​ వచ్చేదని, కానీ తనకు తెలిసిన నిర్మాతలకు నష్టం రాకూడదనే ఈ రిలీజ్​ ప్రయత్నాన్ని విరమించుకున్నాని మనీష్​ షా పేర్కొన్నారు. అలాగే ఇది కార్తీక్ ఆర్యన్​ కోసం కాదు, అల్లు అరవింద్​ కోసం చేస్తున్నాని, షెహజాదే నిర్మాతలు రూ. 40 కోట్లు నష్టపోవడం తనకు ఇష్టం లేదని తెలిపారు. 'అల వైకుంఠపురములో' హిందీ డబ్బింగ్​ వెర్షన్​ను కేవలం 'దించాక్'​ టీవీ ఛానెల్​లో మాత్రమే రిలీజ్​ చేస్తున్నట్లు ప్రకటించారు. 
 

మరిన్ని వార్తలు