Allu Arha : గ్రాండ్‌గా వీడ్కోలు పలికిన 'శాకుంతలం' టీం

10 Aug, 2021 18:05 IST|Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అ‍ల్లు అర్జున్‌ ముద్దుల కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమాతో వెండితెరపై అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. మొదటి సినిమానే పాన్‌ ఇండియా మూవీ కావడం విశేషం. క్రియేటివ్‌ డైరెక్టర్‌ గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్హ భరతుడి పాత్ర పోషిస్తుంది. తాజాగా శాకుంతలంలో అర్హకు సంబంధించిన షూటింగ్‌ పూర్తి కావడంతో చిత్ర యూనిట్‌ ఆమెకు గ్రాండ్‌గా వీడ్కోలు పలికింది.

ఈ సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్‌తో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. కాగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో శాకుంత‌లగా సమంత నటిస్తుండగా, మలయాళ యంగ్ హీరో దుశ్యంతుడిగా నటిస్తున్నాడు. శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో అర్హ కనిపించనుంది. మరోవైపు అల్లు అర్జున్‌ పుష్ప సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. 

A post shared by Allu Arjun (@alluarjunonline)

మరిన్ని వార్తలు