క్రేజీ కాంబినేషన్‌

1 Aug, 2020 01:18 IST|Sakshi
అల్లు అర్జున్‌, కొరటాల శివ

‘అల వైకుంఠపురములో’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం సెట్స్‌పైన ఉండగానే వరుస హిట్లతో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు పచ్చజెండా ఊపారు అల్లు అర్జున్‌.  

ఈ క్రేజీ కాంబినేషన్‌లో యువ సుధ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కొరటాల శివ స్నేహితుడు సుధాకర్‌ మిక్కిలినేని నిర్మించనున్నారు. ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ చిత్రానికి మరో అగ్ర నిర్మాణ సంస్థ జీఏ 2 పిక్చర్స్‌ భాగస్వామిగా ఉండనుంది. అల్లు అర్జున్‌ మిత్రులు శాండీ, స్వాతి, నట్టిలు జీఏ 2 పిక్చర్స్‌ సారథ్యంలో ఈ చిత్రానికి సహనిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు.

మరిన్ని వార్తలు