యంగ్‌ హీరో చిత్రానికి అల్లు అర్జున్‌ సపోర్ట్‌

2 Mar, 2021 15:35 IST|Sakshi

టాలీవుడ్‌ యంగ్ హీరో కార్తికేయ తాజాగా నటిస్తున్న చిత్రం 'చావు కబురు చల్లగా'. మర్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు. వరస విజయాలతో దూసుకుపోతున్న ప్రొడ్యూసర్ బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. బుల్లితెర యాంకర్‌ అనసూయ భరధ్వాజ్‌ స్పెషల్‌ సాంగ్‌లో అలరించనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ‘చావు కబురు చల్లగా’ ప్రమోషన్లలో టాలీవుడ్‌ స్టార్‌ హీరో‌ భాగం కానున్నాడు. మార్చి 9న జరగబోయే  ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌కు ‌ స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌ రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కాగా సినిమా నిర్మాత బన్నివాస్‌ అల్లు అర్జున్‌కు ఇష్టమైన మిత్రుడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఉన్న స్నేహం కారణంగానే బన్నీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు రానున్నట్లు టాక్‌.

ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఎవరు అతిథిగా వస్తున్నారనే దానిపై హీరో, హీరోయిన్‌ ఇతర నటులతో కలిసి ఓ వీడియోను రూపొందించారు. ఇందులో ఆయన వస్తున్నాడా.. నిజంగా ఒప్పుకున్నాడా.. అయినా ఫ్యాన్స్‌ కోసం ఏమైనా చేస్తాడులే.. ఇప్పుడు సినిమా బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ సాధించినట్లు అనిపిస్తుందని వీరంతా ఎగ్జాయిట్‌గా ఫీల్‌ అవుతున్నారు. దీంతో అల్లు అర్జున్‌ రావడం ఖాయం అయిపోయింది. ఈ క్రమంలో ‘ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు విచ్చేస్తున్న అల్లు అర్జున్‌కు మా బాలరాజు గాడి నుంచి చాలా చాలా థ్యాంక్యూ’ అంటూ హీరో కార్తీకేయ మంగళవారం ట్వీట్‌ చేశాడు. ఇక చాల రోజులుగా హిట్‌ కోసం ఎదురు చూస్తున్న కార్తీకేయకు ఈ సినిమా కీలకంగా మారనుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ చేతుల మీదుగా ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ జరుగబోతుంది. ఇంకేముందీ.. బన్నీ అడుగుపెట్టాక సినిమాపై హైప్ పెరగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మరి అల్లు అర్జున్‌ రాక కార్తికేయకు ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి.

చదవండి: ‘జయమ్మ’కు బంపర్‌ ఆఫర్‌: స్టార్‌ హీరో మూవీలో!

అనసూయ మాస్‌ సాంగ్‌​.. ఇరగదీసింది!

>
మరిన్ని వార్తలు