Allu Arha: మట్టి గణేశుడ్ని తయారు చేసిన అల్లు అర్హా... అభిమానులు ఫిదా

10 Sep, 2021 14:40 IST|Sakshi

దేశవ్యాప్తంగా భక్తులు వైభవంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. ఆ పండుగ సంద​ర్భంగా టాలీవుడ్‌ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గారాల పట్టి ఆర్హా అభిమానుల మనసులు దోచుకుంటోంది. వివరాల్లోకి వెళితే..వివిధ రకాల కెమికల్స్‌తో తయారు చేసే గణేశుడి విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని తెలిసిందే. ఈ విషయాన్నే చెబుతూ ఎంతోమంది టాలీవుడ్‌ స్టార్స్‌ ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలను పూజించేలా అభిమానుల్లో అవగాహన కలిగిస్తుంటారు.

అలాంటి వాటిలో అల్లు అర్జున్‌ ఎప్పుడు ముందుంటారు.. కాగా ఈ వినాయక చవితి సందర్భంగా ఆయన కూతురు ఆర్హా తన చిట్టి చేతులతో మట్టి గణేశుడ్ని తయారు చేసింది. కాలుష్య రహిత పండుగను ప్రోత్సహించేలా ఉన్న ఈ పిక్‌ చూసిన ‘వావ్‌ ఆర్హా’ అంటు ఫిదా అవుతున్నారు.

మరిన్ని వార్తలు