Allu Arjun-Samantha: సమంతకు థ్యాంక్స్‌ చెప్పిన బన్నీ

13 Dec, 2021 10:01 IST|Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌-క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్ర చందనం స్మిగ్లింగ్‌ నేపథ్యంలో పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో తొలి పార్ట్‌ను ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పుష్ప టీం ప్రమోషన్‌ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీంతో ఆదివారం పుష్ప ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను జరుపుకుంది.

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ మాట్లాడుతూ సమంతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సమంతకు స్పెషల్‌గా థ్యాంక్య్‌ కూడా చెప్పాడు. ఈ కార్యక్రమంలో బన్నీ మాట్లాడుతూ.. ‘సమంత గారికి థ్యాక్స్‌ చెప్పాలి. స్పెషల్‌ సాంగ్‌లో నటించేందుకు నాయికలకు కొన్ని పరిమితులు ఉంటాయి. అయినా మా సినిమాలో చేయమని అడగ్గానే ఒప్పుకున్నారు.​ తను నమ్మినా నమ్మకపోయినా మేము ఏది అడిగితే అది వచ్చి చేసింది. సైలెంట్‌గా వెళ్లిపోయింది. తన పాత్రకు న్యాయం చేసింది. ఈ సందర్భంగా సమంతకు సభాముఖంగా సమంతకు ధన్యవాదాలు చెబుతున్నాను’ అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. 

మరిన్ని వార్తలు