Allu Arjun : జోరు మీద ఉన్న బన్నీ.. 2025 వరకు డైరీ ఫుల్‌

15 Sep, 2021 14:52 IST|Sakshi

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు అల్లు అర్జున్‌. అందుకే ఇప్పుడు తన ఇమేజ్ కు తగ్గట్లు సినిమాలు చేయాలనుకుంటున్నాడు. అదే సమయంలో పాన్ ఇండియా సినిమాలతో కెరీర్ ను పరుగులు పెట్టించాలనుకుంటున్నాడు. అందుకోసం స్టార్ డైరెక్టర్స్ ను లైనప్ లో పెడుతున్నాడు.

‘అల వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ తో అల్లు అర్జున్ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. వరుసగా మూవీస్ చేయాలని ఫిక్స్ అయ్యాడు.ఇప్పటికే పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు రెడీ అవుతోంది. క్రిస్మస్ కానుకగా ఈ మూవీని విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే పుష్ప పార్ట్ 2 మాత్రం కొంత ఎక్కువ గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాడు బన్నీ. 

పుష్ప ఫస్ట్ పార్ట్ పూర్తి కాగానే,వేణు శ్రీరామ్ మేకింగ్ లో ఐకాన్ పట్టాలెక్కనుంది. దసరా కానుకగా ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేయనున్నారట. పూజా హెగ్డే, కృతిశెట్టి శెట్టీ హీరోయిన్స్ గా నటించనున్నారట. ఇక ఐకాన్ పూర్తైన వెంటనే పుష్ప పార్ట్ 2 తెరకెక్కాలి. కాని ఇప్పుడు అల్లు అర్జున్ మూడ్ మారిందని సమాచారం. ఐకాన్ తో పాటు బోయపాటి మేకింగ్ లో మూవీ చేయాలనుకుంటున్నాడట. అల్లు అర్జున్, బోయపాటి కాంబోలో ‘సరైనోడు’వచ్చి సూపర్‌ హిట్‌ అయింది. ఇప్పుడు అంతకు మించి మాస్ మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఈ రెండు చిత్రాలు పూర్తైన తర్వాత అల్లు అర్జున్ పుష్ప 2 పై దృష్టి పెట్టనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి.


రాబోయే ఐదేళ్లకు సరిపడా సినిమాలను ఇప్పుడే ఫిక్స్ చేసుకున్నాడు బన్ని. 2025 వరకు అల్లు అర్జున్ డైరీ ఫుల్ అయినట్లు సమాచారం. పుష్ప సిరీస్, ఐకాన్, బోయపాటితో మూవీస్ పూర్తైన వెంటనే,గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే  ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేయనున్నాడు. వీరితో పాటు కొరటాల శివ, మురుగదాస్ కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం స్టోరీస్ రెడీ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు