Jhund: ఓటీటీలో అమితాబ్‌ బచ్చన్‌ లేటెస్ట్‌ మూవీ, ఎక్కడో తెలుసా?

22 Apr, 2022 08:51 IST|Sakshi

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా 'జుండ్‌'. నాగ్​పూర్​కు చెందిన ప్రముఖ ఫుట్​బాల్​ కోచ్​ విజయ్​ బార్సే జీవితం ఆధారంగా డైరెక్టర్‌ నాగరాజ్‌ మంజులే ఈ​ సినిమాను తెరకెక్కించాడు. అంకుశ్‌, ఆకాష్‌, రింకు సహా తదితరులు ఈ చిత్రంలో నటించారు. విజయ్ బార్సే పాత్రలోకి అమితాబ్​ పరకాయ ప్రవేశం చేశాడు. టీ సిరీస్‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 4న రిలీజవగా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రానుంది. డిజిటల్‌ రైట్స్‌ సొంతం చేసుకున్న జీ5లో జుండ్‌ అలరించనుంది. మే 6 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

చదవండి: అది చూసి అవకాశం..నమ్మలేకపోయా: కేజీఎఫ్‌-2 ఎడిటర్‌

అక్షయ్‌ పాన్‌ మసాలా యాడ్‌ వివాదంపై స్పందించిన అజయ్‌, ఏమన్నాడంటే..

మరిన్ని వార్తలు