ఆడవాళ్లను అలుసుగా చూడకూడదు

9 Oct, 2020 05:52 IST|Sakshi
కార్తీక్‌ రెడ్డి, శ్వేత

కార్తీక్‌ రెడ్డి, నేనే శేఖర్, స్వాతి, శ్వేత, ఆయేషా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అమ్మాయంటే అలుసా?’. నేనే శేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవులూరి భాస్కర్‌ రెడ్డి సమర్పణలో వై. బ్రహ్మ శేఖర్, వై. లిఖితా చౌదరి నిర్మించారు. ఈ నెల 16న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నేనే శేఖర్‌ మాట్లాడుతూ – ‘‘ఆడవాళ్లను అలుసుగా చూడకూడదు. వారికి గౌరవం ఇవ్వాలి అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. చాలా సినిమాలకు ప్రొడక్షన్‌ మేనేజర్‌గా చేశాను. ఆ అనుభవంతో ఈ సినిమా తెరకెక్కించాను’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: వినీష్‌ గౌడ్, కో ప్రొడ్యూసర్‌: ఎన్‌. మాధవరెడ్డి.

మరిన్ని వార్తలు