Anasuya Bharadwaj : మరో పాన్‌ ఇండియా చిత్రంలో అనసూయ... పోస్టర్‌ అవుట్‌

19 Jan, 2023 14:54 IST|Sakshi

యాంకర్‌ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓవైపు స్టార్‌ యాంకర్‌గా కొనసాగుతూనే, మరోవైపు వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. రంగస్థలం, పుష్ప సినిమాలతో తనకంటూ ‍ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ తాజాగా మరో పాన్‌ ఇండియా సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ హీరోగా మైఖేల్‌ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈయనతో పాటు అనసూయ కూడా ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. మ్యాడ్‌ ఆఫ్‌ క్వీన్‌ అంటూ పవర్‌ ఫుల్‌ గెటప్‌లో అనసూయ కనిపిస్తుంది. మరి ఈ సినిమా అనసూయ కెరీర్‌కు ఎంతవరకు ప్లస్‌ అవుతుందన్నది చూడాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు