Flashback: అనసూయ-రెజినా ‘ఫ్లాష్ బ్యాక్’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌

20 Jul, 2022 19:28 IST|Sakshi

రెజీనా, అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘ఫ్లాష్ బ్యాక్’. గుర్తుకొస్తున్నాయి అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో కొరియోగ్రాఫర్‌, డైరెక్టర్‌ ప్రభుదేవా కీ రోల్‌ పోషిస్తున్నాడు. డాన్ సాండీ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్‌ బ్యానర్లో ఏఎన్‌ బలాజీ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఇటీవలె షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఇప్పటి వరకు పోస్ట్‌ ప్రాడక్షన్‌ పనులతో బిజీగా ఉంది. తాజాగా ఈ మూవీ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌ వదిలారు మేకర్స్‌. ‘ఫ్లాష్ బ్యాక్’ మూవీకి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే సీజీ పనులు కూడా పూర్తవుతాయని మేకర్స్‌ తెలిపారు.

చదవండి: ఆయన కోసమే నగ్నంగా నటించా.. హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

ఇక అతిత్వరలోనే మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలను స్టార్ట్‌ చేస్తామని ఈ నేపథ్యంలో ముందుగా ట్రైలర్‌ విడుదల చేస్తామన్నారు. ఇక తొందర్లోనే మూవీ విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని దర్శక-నిర్మాతలు చెప్పారు. కాగా తెలుగు తమిళంలో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ స్పష్టం చేశారు. కాగా మేరకు దర్శక-నిర్మాతలు మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో రెజినా ఆంగ్లో-ఇండియన్ టీచర్‌ పాత్రలో కనిపిస్తారు. అనసూయ మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ రెండు పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభుదేవా పాత్ర చాలా కొత్తగా ఉండబోతుంది’ అని తెలిపారు. శామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు చల్లా భాగ్యలక్ష్మీ, అనిరుధ్ శాండిల్య తెలుగులో పాటలు రాశారు. నందు తుర్లపాటి మాటలు అందించారు.

మరిన్ని వార్తలు