శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్‌’ విడుదల తేదీ వచ్చేసింది

13 Aug, 2021 07:56 IST|Sakshi

శ్రీముఖి, మనో, రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్రేజీ అంకుల్స్‌’. ఈ. సత్తిబాబు దర్శకుడిగా వహించిన ఈ సినిమాను బొడ్డు అశోక్‌ నిర్మిస్తున్నాడు. ఈ నెల 19న ప్రేక్షకులముందుకురానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతల్లో ఒకరైన శ్రేయాస్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కామెడీ జానర్‌లో తెరకెక్కిన చిత్రమిది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నాం. అయితే పెద్ద సినిమాలు ఉండటంతో వాయిదా వేశాం. ఆ తర్వాత మేలో లాక్‌డౌన్‌ వచ్చింది. ఫైనల్‌గా ఈ నెలలో రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదల చేసిన మా సినిమా టైటిల్‌ సాంగ్‌ మంచి స్పందన వచ్చింది. రఘు కుంచె స్వరపరచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించగా.. శ్రీముఖి తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంది’ అని చెప్పుకొచ్చాడు.  

మరిన్ని వార్తలు