‘వరుడు కావలెను’ నుంచి మరో సాంగ్‌ విడుదల

22 Sep, 2021 16:51 IST|Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్‌, టీజర్‌తో పాటు విడుదలైన  ‘కోలా కల్లే ఇలా’, ‘దిగు దిగు’ పాటలు సైతం ప్రేక్షకాదరణని పొందాయి.

తాజాగా ఆ సినిమా మూడో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ‘మనసులోనే నిలిచిపోకే.. మైమరుపులా మధురిమ’ అంటూ పల్లవితో సాగే ఈ మెలోడీ మనసుకు హత్తుకునేలా ఉంది. పాట తీసిన లోకేషన్స్‌ ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయి. పాటలో హీరోయిన్‌ ఎక్స్‌​ప్రెషన్స్‌ అదిరిపోయాయి. నాగ శౌర్య, రీతూ వర్మ జంట అందంగా, చూడముచ్చటగా ఉంది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. ‘మనసులోనే నిలిచిపోకే’ పాటకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్‌ అందించగా,  గాయనీ చిన్మయి మనసుకు హత్తుకునేలా ఈ పాటను ఆలపించిందని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది చిత్రబృందం.

చదవండి: ‘వరుడు కావలెను’ టీజర్‌ వచ్చేసింది

మరిన్ని వార్తలు