Anupama Parameswaran: హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌కు కరోనా

25 Aug, 2022 09:44 IST|Sakshi

హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌కు కరోనా సోకింది. ఇటీవలె కార్తికేయ-2 ప్రమోషన్స్‌లో భాగంగా చాలా సార్త్‌, సౌత్‌ సహా చాలా ప్రాంతాలు చుట్టేసింది. ఈ క్రమంలో జలుబు, దగ్గు వంటి లక్షణాలు బయటపడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌ అని తేలినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమె ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లిందట.

కాగా ఇక సినిమాల విషయానికి వస్తే.. కార్తికేయ-2 సినిమాతో భారీ హిట్టు కొట్టిన అనుపమ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. నిఖిల్‌తో ఆమె నటించిన 18 పేజేస్‌ చిత్రం ఏప్రిల్‌ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కార్తికేయ-2తో హిట్‌ అందుకున్న ఈ జోడీ మరోసారి హిట్‌ పెయిర్‌గా నిలుస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు