‘ఆది పురుష్’ అనే ఫ్యాంటసీ చిత్రంలో ప్రభాస్ నటించనున్న విషయం తెలిసిందే. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ నిర్మించనున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్ర చేయనున్నారు. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రభాస్ సరసన సీత పాత్రలో ఎవరు నటిస్తారు? అనేది చర్చనీయాంశం అయింది. సీత పాత్రలో కీర్తీ సురేశ్, కియారా అద్వానీ పేర్లు ఆ మధ్య వినిపించాయి. తాజాగా అనుష్కా శర్మను ఈ పాత్రకు సంప్రదించారని సమాచారం.
ఆల్రెడీ కథాచర్చలు పూర్తయ్యాయట. అయితే ప్రస్తుతం అనుష్కా శర్మ ప్రెగ్నెంట్. జనవరిలో డెలివరీ అని ఇటీవలే ప్రకటించారు. జనవరి నుంచే ‘ఆదిపురుష్’ చిత్రీకరణ ప్రారంభిస్తారని ఓ వార్త. ఒకవేళ అనుష్కా శర్మ ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. డెలివరీ అయిన వెంటనే షూటింగ్లో పాల్గొంటారా? లేక ఆలస్యంగా చిత్రీకరణలో పాల్గొంటారో చూడాలి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్గా కనిపిస్తారు.