మేము టీకా వేయించుకున్నాం..

8 Jun, 2021 08:04 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళ సినిమా : వ్యాక్సిన్‌ ద్వారానే కరోనా మహమ్మారిని తరిమికొట్టవచ్చని పలువురు ప్రముఖులు సూచిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ తన తనయుడు ఏ.ఆర్‌. హమీన్‌తో కలసి సోమవారం చెన్నైలో వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన కుమారుడితో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘మా వంతు విధిని నిర్వర్తించాము. నేను నా కుమారుడు ఏఆర్‌ హమీన్‌ కోవీషీల్డ్‌ టీకా మొదటి డోస్‌ వేయించుకున్నాం. మీరందరూ తప్పకుండా వ్యాక్సిన్‌ వేసుకోవాలి’ అని ఆయన సూచించారు. 

A post shared by ARR (@arrahman)

చదవండి: 
కరోనాతో నెల రోజులు ఆస్పత్రిలోనే, హోప్స్‌ మొత్తం పోయాయి: నటి 

మరిన్ని వార్తలు