Singer Armaan Malik: నన్ను నమ్మండి.. మహేశ్‌ ఫ్యాన్స్‌కు సింగర్‌ స్పెషల్‌ మెసేజ్‌

18 Apr, 2022 12:32 IST|Sakshi

సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం​ సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం మహేశ్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన క‌ళావ‌తి, పెన్నీ సాంగ్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. మూడవ పాటను బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్మాన్ మాలిక్ పాడాడు. దీంతో ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ మహేష్ ఫ్యాన్స్ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై అర్మాన్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు.

నాకు సందేశాలు పంపుతున్న మహేశ్‌ బాబు అభిమానులందరికి, నిజంగా సర్కారు వారి పాట నుంచి నెక్ట్స్‌ సాంగ్‌ ఎప్పుడు వస్తుందనేదానిపై నా వద్ద ఎలాంటి క్లూ లేదు. నన్ను నమ్మండి. నాకు కూడా తెలియదు.ప్ర‌తీ దానికి ఒక ఇంటర్న‌ల్ ప్రాసెస్ ఉంటుంది. మేమంతా ఓపిక‌గా ప‌నిచేస్తున్నాం. అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చేదాకా వేచి చూడండి అంటూ ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు