ప్రముఖ చిత్రకారుడు ఇళయరాజా మృతి

8 Jun, 2021 08:24 IST|Sakshi

చెన్నై: కరోనాతో చిత్రకారుడు ఇళయరాజా ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన వయసు 43 ఏళ్లు. కుంభకోణం సమీపంలోని సెంబియవరంబిల్‌ అనే గ్రామానికి చెందిన ఇళయరాజా చిత్రకారుడిగా మంచి పేరుగాంచారు. కరోనా వ్యాధి సోకడంతో  ఇళయరాజా ఇటీవల చెన్నై, ఎగ్మోర్లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన మృతికి సీఎం స్టాలిన్,  నటుడు దర్శకుడు పార్తిబన్, పా.రంజిత్‌   సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు