‘డేజావు’కి గుమ్మడికాయ కొట్టారు

31 Jul, 2021 14:51 IST|Sakshi

డేజావు చిత్రానికి గుమ్మడికాయ కొట్టారు. నటుడు అరుళ్‌నిధి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం డేజావు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు వెర్షన్లలో తీస్తున్నారు. ఈ చిత్రానికి పీజీ ముత్తయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అరవింద్‌ శ్రీనివాసన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌లో నవీన్‌చంద్ర కథానాయకుడిగా నటిస్తున్నారు. దీనికి జపాన్‌ సంగీతాన్ని, పీజీ ముత్తయ్య ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ గురువారం పూర్తి చేసుకుందని చిత్ర వర్గాలు తెలిపాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.

మరిన్ని వార్తలు