Kalyanam Kamaneeyam : “కళ్యాణం కమనీయం” నుంచి మరో లిరికల్‌ సాంగ్‌ అవుట్‌

7 Jan, 2023 17:15 IST|Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కళ్యాణం కమనీయం'. అనిల్‌ కుమార్‌ అల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేస్తుంది. సంక్రాంతి కానుకగా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా “అయ్యో ఏంటో నాకు” అనే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు.

కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, స్వీకర్ అగస్తి పాడారు. ‘అయ్యో ఎంటో నాకు అన్ని వచ్చి పక్కనున్న ఒక్క అదృష్టమేమో దూరముందే..అన్నీ ఇచ్చేసినట్టు ఇచ్చి లాగేసుకుంటు దైవం వైకుంఠపాళీ ఆడతాడే’ అంటూ భార్యభర్తల మధ్య వచ్చే మనస్పర్థల నేపథ్యంలో సాగుతుందీ పాట.


 

మరిన్ని వార్తలు