జీవితంతో బాబూజి

30 Apr, 2023 04:09 IST|Sakshi
ప్రసాద్, మీరాకుమార్, దిలీప్‌

భారత మాజీ ఉపప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ బయోపిక్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘బాబూజి’. దిలీప్‌ రాజా దర్శకత్వంలో రూపొందు తున్న ఈ చిత్రం షూటింగ్‌ గుంటూరులో జరుగుతోంది. కాగా అదే నగరానికి వెళ్లిన జగ్జీవన్‌రామ్‌ కుమార్తె, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ ఈ చిత్రంలో జగ్జీవన్‌రామ్‌ పాత్రధారి మిలటరీ ప్రసాద్‌పై చిత్రీకరిస్తున్న సీన్‌కి క్లాప్‌ ఇచ్చారు.

ఈ సందర్భంగా దిలీప్‌ రాజా మాట్లాడుతూ – ‘‘మహాత్మాగాంధీ ఆహ్వానంతో స్వాతంత్య్ర ఉద్యమంలోకి వచ్చిన జగ్జీవన్‌రామ్‌ మరెందరినో ఆ ఉద్యమంలోకి తీసుకురావటం, జైలు శిక్ష అనుభవించడం వంటివాటిని ‘బాబూజి’లో తప్పనిసరిగా చూపించాలని మీరాకుమార్‌ సూచించారు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, 2024 జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు